ఐకానిక్ ప్రాజెక్టులో దీపికా!
పాన్ ఇండియా సినిమా లెవల్స్ని మరో మెట్టు ఎక్కించే ప్రాజెక్ట్ – ‘AA22xA6’. అల్లుఅర్జున్ – అట్లీ కలయికలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ బ్యూటీ దీపికా అన్ బోర్డు లోకి వచ్చింది. దీపికా ఈ సినిమాలో భాగస్వామ్యమయినట్టు అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
“Queen marches to conquer!” అనే ట్యాగ్లైన్తో విడుదలైన దీపికా వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్లో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె మెయిన్ ఫిమేల్ లీడ్గా కనిపించనుంది. ఇది ఆమెకు సౌత్ లో ఫస్ట్ మాస్ కమర్షియల్ సినిమా కావడం విశేషం. ఆమె పాత్ర ఎంతో శక్తివంతంగా ఉంటుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
దీపికా పాత్ర అధికారికంగా కన్ఫర్మ్ అయినప్పటికీ.. ఈ మూవీలో మరో రెండు ఫీమేల్ లీడ్స్ కోసం మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ “పారలల్ యూనివర్స్” కాన్సెప్ట్ చుట్టూ తిరగబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ మూడు విభిన్న లుక్స్లో కనిపించనున్నాడట. అందులో ఒకటి యానిమేటెడ్ క్యారెక్టర్ కావచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి.
ఇది సాదాసీదా మాస్ సినిమా కాదు అని ప్రచార చిత్రాలతో అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్ VFX, అత్యాధునిక టెక్నిక్స్తో ఈ సినిమా రూపొందనుంది. మ్యూజిక్ విభాగాన్ని యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ నిర్వహించనున్నట్టు టాక్.
‘పుష్ప 2’తో నేషనల్ రేంజ్లో గుర్తింపు పొందిన అల్లుఅర్జున్, ఇప్పుడు ‘AA22xA6’తో తన స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. త్రివిక్రమ్తో ప్లాన్లో ఉన్న మైథలాజికల్ మూవీతో పాటు, ఈ సినిమా కూడా అతని యూనివర్స్ని భారీగా విస్తరించబోతోంది. ఈ సినిమా ఈ నెల నుంచే సెట్స్ మీదకు వెళ్లనుంది.