సోనాక్షి సినిమాకు కొత్త రిలీజ్ డేట్ !
"మీ క్యాలెండర్లో గుర్తు పెట్టుకోండి. మా ఉత్కంఠభరిత థ్రిల్లర్ నికితా రాయ్ కొత్త విడుదల తేదీ ఖరారైంది. జూన్ 27, 2025న థియేటర్లలో సస్పెన్స్ని ఆస్వాదించండి..." అని సోనాక్షి తన సోషల్ మీడియా హ్యాండిల్లో రాసుకొచ్చింది.;
బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ .. సోనాక్షి సిన్హా నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘నికితా రాయ్’ విడుదల తేదీ వాయిదా పడింది. మొదట మే 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు జూన్ 27 న థియేటర్లలోకి రానుందని సోనాక్షి సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది. "మీ క్యాలెండర్లో గుర్తు పెట్టుకోండి. మా ఉత్కంఠభరిత థ్రిల్లర్ నికితా రాయ్ కొత్త విడుదల తేదీ ఖరారైంది. జూన్ 27, 2025న థియేటర్లలో సస్పెన్స్ని ఆస్వాదించండి..." అని సోనాక్షి తన సోషల్ మీడియా హ్యాండిల్లో రాసుకొచ్చింది.
సోనాక్షి సోదరుడు కుశ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్న నికితారాయ్ ఆయన తొలి దర్శకత్వ చిత్రం. ఈ సైకలాజికల్ థ్రిల్లర్లో అర్జున్ రాంపాల్, పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిక్కీ భగ్నానీ, విక్కీ భగ్నానీ, అంకుర్ తక్రానీలు నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్, క్రాటోస్ ఎంటర్టైన్మెంట్, నికితా పై ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు. ఆనంద్ మెహతా, ప్రకాష్ నంద్ బిజ్లానీ, శక్తి భట్నాగర్, మెహనాజ్ షేక్, ప్రేమ్ రాజ్ జోషీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లండన్లో 35 రోజుల షూటింగ్ షెడ్యూల్ను ఈ ఏడాది పూర్తి చేసుకుంది. షూటింగ్ అనుభవం గురించి సోనాక్షి మాట్లాడుతూ, "ఇది చాలా గొప్ప షూట్ అనుభవం. నా సోదరుడి తొలి చిత్రంలో నటించడం నాకు చాలా ప్రత్యేకం. ఈ చిత్రంలోని అద్భుతమైన నటీనటుల సమూహం నన్ను మరింత ఉత్తేజపరిచింది. పరేష్ జీతో తొలిసారి కలిసి పనిచేయడం గౌరవంగా భావించాను. ఈ షూట్ సవాలుతో కూడుకున్నది కాబట్టి మరింత ఆనందంగా అనిపించింది" అని చెప్పింది. నికితా రాయ్ తో పాటు, సోనాక్షి తెలుగు సినిమా రంగంలోకి ‘జటాధర’ అనే సూపర్నాచురల్ ఫాంటసీ థ్రిల్లర్తో అడుగుపెడుతోంది.