ఆస్కార్ అకాడమీలో తెలుగు వ్యక్తి!
ప్రపంచంలోని అత్యున్నత సినిమా గౌరవం ఆస్కార్ అవార్డులు. ఈ అవార్డులను నిర్వహించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) 2025 సభ్యత్వానికి టాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ యుగంధర్ తమ్మారెడ్డి ఎంపికయ్యారు.;
ప్రపంచంలోని అత్యున్నత సినిమా గౌరవం ఆస్కార్ అవార్డులు. ఈ అవార్డులను నిర్వహించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) 2025 సభ్యత్వానికి టాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ యుగంధర్ తమ్మారెడ్డి ఎంపికయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో 125కి పైగా సినిమాలకు వీఎఫ్ఎక్స్ అందించిన ఆయన, 'రంగస్థలం, అల వైకుంఠపురములో, దేవర' వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
1999లో మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో వీఎఫ్ఎక్స్ రంగంలో అడుగుపెట్టిన యుగంధర్, మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా విజువల్ ప్రెజెంటేషన్ను ఓ లెవల్కి తీసుకెళ్లారు. ట్రైలర్ ఎడిటింగ్తో ప్రారంభించిన ఆయన ప్రయాణం, సుకుమార్, త్రివిక్రమ్ వంటి 50కి పైగా టాప్ డైరెక్టర్లతో సాగింది.
ఈ ఏడాది కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా, పాయల్ కపాడియా, మాక్సిమా బసు లతో పాటు యుగంధర్కు కూడా ఈ ప్రతిష్ఠాత్మక సభ్యత్వం లభించడం భారతీయ సాంకేతిక ప్రతిభకు గుర్తింపు. ప్రపంచ స్థాయిలో తెలుగు వీఎఫ్ఎక్స్ టాలెంట్ను చాటిన యుగంధర్పై టాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.