డైరెక్ట్ గా ఓటీటీలోకి పృధ్విరాజ్ సుకుమారన్ సినిమా
సర్జమీన్ థియేటర్లలో రిలీజ్ కాకుండా.. డైరెక్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా జులై 25, 2025న జియో హాట్స్టార్లో ఎక్స్క్లూసివ్గా రిలీజ్ అవుతోంది.;
మాలీవుడ్ సూపర్స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటీమణి కాజోల్ దేవ్గణ్ తొలిసారి జోడీ కట్టిన పాట్రియాటిక్ బాలీవుడ్ థ్రిల్లర్ ‘సర్జమీన్’. ఈ మూవీ కాశ్మీర్లోని సంఘర్షణాత్మక వాతావరణంలో సెట్ చేయబడిన ఒక ఎమోషనల్ రోలర్కోస్టర్. ఈ సినిమాతో కయోజ్ ఇరాన్ దర్శకుడిగా తొలి ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా స్ట్రాంగ్ కథతో. ఈ రోజు రిలీజైన ఈ మూవీ అఫీషియల్ టీజర్ ఒక సర్ప్రైజ్ విషయాన్ని వెల్లడించింది.
సర్జమీన్ థియేటర్లలో రిలీజ్ కాకుండా.. డైరెక్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా జులై 25, 2025న జియో హాట్స్టార్లో ఎక్స్క్లూసివ్గా రిలీజ్ అవుతోంది. ఈ న్యూస్ సినిమా లవర్స్ని ఆల్రెడీ ఎక్సైట్ చేస్తోంది. కథ విషయానికొస్తే, పృథ్విరాజ్ ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. అతను యుద్ధభూమిలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ తీవ్రమైన అంతర్గత సంఘర్షాలను ఎదుర్కొంటాడు. ఈ రోల్లో పృథ్విరాజ్ తన యాక్టింగ్తో మళ్లీ ఒకసారి అదరగొట్టబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతుంది.
కాజోల్, ఎప్పటిలాగే, ఒక ఎమోషనల్ క్యారెక్టర్లో హృదయాన్ని కదిలించే పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. ఆమె పాత్ర కథలో కీలకమైన టర్నింగ్ పాయింట్ అని టాక్. అయితే, అసలు సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇబ్రహీం అలీ ఖాన్. ఈ యంగ్ యాక్టర్ ఒక టెర్రరిస్ట్ రోల్లో నెగెటివ్ షేడ్స్తో అందర్నీ షాక్ చేయబోతున్నాడు. ఈ ఏడాది నాదియాఁ తర్వాత, ఇది అతని రెండో డిజిటల్ రిలీజ్ కావడం విశేషం. ఈ బిగ్ బడ్జెట్ సినిమాని హిరూ యశ్ జోహార్, కరణ్ జోహార్, ఆదర్ పూనావాలా, అపూర్వ మెహతా, స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.