రెమ్యునరేషన్ పెంచేసిన రుక్మిణి
‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఇప్పుడు సౌత్ లో హాట్ ఫేవరెట్గా మారిపోయింది.;
‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఇప్పుడు సౌత్ లో హాట్ ఫేవరెట్గా మారిపోయింది. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన రుక్మిణి, ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆమె పెర్ఫార్మెన్స్కు మంచి పేరు వచ్చింది.
ప్రస్తుతం వరుస ఆఫర్స్తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ శివకార్తికేయన్ – మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న 'మద్రాసి' సినిమాలో నటిస్తోంది. అన్నింటికన్నా మిన్నగా ఎన్టీఆర్-నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'డ్రాగన్'లో రుక్మిణి లీడ్ హీరోయిన్గా ఎంపికయ్యింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా రుక్మిణిపై ఇప్పటికే కొన్ని సన్నివేశాలను తెరకెక్కించాడట ప్రశాంత్ నీల్.
లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, 'డ్రాగన్' కోసం రుక్మిణి రూ.1.25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో రుక్మిణి రోల్ కూడా ఎంతో కీలకంగా ఉండబోతుందట. మొత్తంగా 'డ్రాగన్'తో రుక్మిణి టాప్ లీగ్లోకి వెళుతుందేమో చూడాలి.