'వార్ 2' కోసం పట్టువదలని సితార!

ఈ ఆగస్ట్ 14న రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అవే బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ ‘వార్ 2’, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’.;

By :  S D R
Update: 2025-06-29 06:01 GMT

ఈ ఆగస్ట్ 14న రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అవే బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ ‘వార్ 2’, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ కన్ఫమ్ అయ్యింది.

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలసి నటిస్తున్న ‘వార్ 2’పై భారీ అంచనాలున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఐమాక్స్ స్క్రీన్లను ముందుగానే బుక్ చేసుకుని, ‘కూలీ’ చిత్రానికి ఐమాక్స్ లు కూడా దక్కకుండా చేసింది. దీనివల్ల ఉత్తరాదిన ‘వార్ 2’కి మరింత అడ్వాంటేజ్ లభించనుంది. అయితే, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం రజనీ, నాగార్జున, ఉపేంద్రల వంటి స్టార్ కాస్ట్‌తో ‘కూలీ’కి హైప్ ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే 'కూలీ' సినిమాలో అమీర్ ఖాన్ కూడా కేమియోలో మురిపించబోతుండటం విశేషం.

ఇక తెలుగులో ‘వార్ 2’ రైట్స్‌ను సొంతంగా రిలీజ్ చేసేందుకు యష్ రాజ్ ప్రయత్నిస్తుండగా, సితార నాగవంశీ మాత్రం తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఏషియన్ సునీల్ ఇప్పటికే ‘కూలీ’ రైట్స్ దక్కించుకున్నారరు. దీంతో తెలుగు స్టేట్స్‌లో సితార vs ఏషియన్ పోటీ కూడా ప్రారంభమైంది.

ఇప్పటివరకు టీజర్ మాత్రమే వచ్చిన ‘వార్ 2’పై మిక్స్‌డ్ రెస్పాన్స్ ఉన్నా, థియేటర్ల బుకింగ్‌లో ముందుంది. ‘కూలీ’ మాత్రం భారీ మాస్ హైప్‌తో దూసుకెళ్తోంది. అయితే రజనీకాంత్‌కు కూడా ఈసారి థియేటర్ల కోసం పోటీ పడాల్సిన పరిస్థితి ఎదురవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News