'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్!
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’ జూన్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.;
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’ జూన్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. నటీనటులు నాగార్జున, ధనుష్, రష్మిక లతో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా దర్శకధీరుడు రాజమౌళి హాజరై చిత్రబృందాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎస్.ఎస్. రాజమౌళి, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ నిజంగా మైండ్ బ్లోయింగ్గా ఉందని చిత్ర బృందాన్ని అభినందించారు. శేఖర్ కమ్ముల తన సిద్ధాంతాల్ని నమ్ముకుని చిత్రాలు తీస్తారని, అయితే తాను తీసే సినిమాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయని చమత్కరించారు. 'కుబేర' టైటిల్తో ఆసక్తి పెరిగిందని తెలిపారు.
నటి రష్మిక మాట్లాడుతూ, 'శేఖర్ సార్ దర్శకత్వంలో నటించాలన్న కల ఈ సినిమాతో నెరవేరింది. ధనుష్తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని ఆశిస్తున్నాను' అని తెలిపారు. ధనుష్ మాట్లాడుతూ, ''కుబేర’ తమిళంలో నా 51వ చిత్రం. తెలుగులో రెండో సినిమా. శేఖర్ గారు చూపిన నమ్మకం చూసి భయంగా ఉంది' అంటూ సరదాగా స్పందించారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, 'ఇది నా శైలికి భిన్నమైన సినిమా. ‘కుబేర’ నాకు తల్లి లాంటిది. ఇందులో ఎమోషన్, కామెడీ, థ్రిల్ అన్నీ ఉంటాయి. ఇది నిజమైన పాన్ ఇండియా మూవీ' అన్నారు. రష్మికను, ధనుష్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. నాగార్జున, రష్మికతో పని చేయడం ఆనందంగా ఉందని' అన్నారు. నాగార్జున మాట్లాడుతూ, 'ఇది పూర్తిగా శేఖర్ సినిమా. మేమంతా పాత్రధారులమే. శేఖర్ తన కంఫర్ట్ జోన్ను దాటి అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు' అని ప్రశంసించారు.