రేపే గద్దర్ అవార్డుల కార్యక్రమం!
తెలంగాణ ప్రభుత్వం తరఫున గడిచిన 14 ఏళ్లలో తొలిసారిగా నిర్వహించబోతున్న ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక రేపు (జూన్ 14) హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది.;
తెలంగాణ ప్రభుత్వం తరఫున గడిచిన 14 ఏళ్లలో తొలిసారిగా నిర్వహించబోతున్న ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక రేపు (జూన్ 14) హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి వాటి హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలకు అవార్డులు ఇవ్వనున్నారు. అలాగే 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా పురస్కారాలు అందజేస్తారు.
ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ – ‘14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఎంతో గౌరవంగా ఈ అవార్డులను అందిస్తోంది. ఈ వేడుకను విజయవంతం చేయాలన్న బాధ్యత మన సినీ పరిశ్రమపై ఉంది. ప్రపంచవ్యాప్తంగా వీక్షించేందుకు ఐ అండ్ పీఆర్ శాఖ ద్వారా లైవ్ టెలికాస్ట్ ఉండనుంది. సాయంత్రం 6 గంటలకు వేడుక ప్రారంభం అవుతుంది. ఈ సాంప్రదాయాన్ని గద్దర్ ఫిల్మ్ అవార్డుల రూపంలో రాష్ట్రం ప్రారంభించడంపై పరిశ్రమంతా గర్వపడుతోంది‘ అన్నారు.