ఆమిర్ vs ఎన్టీఆర్.. ఫాల్కేగా ఎవరు?
భారతీయ సినీ పితామహుడు, తొలితరం ఫిల్మ్మేకర్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రాజెక్ట్ ఇప్పుడు బాలీవుడ్తో పాటు సౌత్లోనూ హాట్ టాపిక్గా మారింది.;
భారతీయ సినీ పితామహుడు, తొలితరం ఫిల్మ్మేకర్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రాజెక్ట్ ఇప్పుడు బాలీవుడ్తో పాటు సౌత్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఫాల్కే పాత్రలో నటించేందుకు అగ్రనటులు ఆమిర్ ఖాన్, ఎన్టీఆర్లు ముందస్తుగా ఉన్నారన్న వార్తలు, వేర్వేరు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఈ కథతో ప్రాజెక్ట్లు ప్రకటించడంతో, ఇండస్ట్రీలో ఆసక్తికర పోటీ నెలకొంది.
ఇటీవల అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించనున్నారు. ఈ చిత్రానికి 'త్రీ ఇడియట్స్, పీకే' వంటి బ్లాక్బస్టర్ల దర్శకుడు రాజ్కుమార్ హీరాణీ దర్శకత్వం వహించనున్నారు. హీరాణీతో పాటు అభిజిత్ జోషీ, హిందూకుష్, ఆవిష్కర్ భరద్వాజ్లు స్క్రిప్ట్పై గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. అక్టోబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దాదాసాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసాల్కర్ ఈ ప్రాజెక్టుకు మద్దతు ప్రకటించారన్నది మరో విశేషం.
మరోవైపు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి 'మేడ్ ఇన్ ఇండియా' పేరుతో మరో ఫాల్కే బయోపిక్ను సమర్పించబోతున్నట్టు 2023 సెప్టెంబరులోనే ప్రకటించారు. ఈ చిత్రాన్ని నితిన్ కక్కడ్ డైరెక్ట్ చేయనుండగా, ఎస్.ఎస్. కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఎన్టీఆర్ టైటిల్ రోల్ చేయనున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తై, ప్రీ-ప్రొడక్షన్ తుది దశకు చేరిందని సమాచారం.
ఒకే వ్యక్తి జీవితం ఆధారంగా రెండు భారీ బయోపిక్లు సమకాలీనంగా సెట్స్ పైకి వెళ్లబోతుండటంతో ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకవైపు బాలీవుడ్ టాప్ కాంబో (ఆమిర్ – హీరాణీ), మరోవైపు పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ – రాజమౌళి బ్రాండ్. ఈ పోటీలో ఎవరు ముందుగా మొదలుపెడతారు? ప్రేక్షకుల్ని ఎవరు మెప్పిస్తారు? అన్నదానికి సమాధానం త్వరలో వెలువడనుంది.