‘కుబేర‘ టికెట్ ధరల పెంపుకు అనుమతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కుబేర’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.;

By :  S D R
Update: 2025-06-19 09:54 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కుబేర’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రేపు ప్రపంచవ్యాప్తంగా ‘కుబేర‘ విడుదలకు ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మల్టిప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో హయ్యర్ క్లాస్ టికెట్ల ధరలను రూ.75 (జీఎస్టీతో సహా) వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరల పెంపు మొదటి 10 రోజులపాటు (జూన్ 20 నుంచి జూన్ 29 వరకు) అమలులో ఉంటుంది.

‘కుబేర’ చిత్ర నిర్మాతలు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా రాష్ట్ర హోం శాఖకు టికెట్ ధరల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణ వ్యయం, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూ మరియు ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో పెద్ద చిత్రాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించిన విధంగానే ఈ సినిమాకు కూడా టికెట్ ధరల పెంపును ఆమోదించింది.

Tags:    

Similar News