నాగ్ 100వ సినిమాకి సన్నాహాలు!
ప్రస్తుతం నాగార్జున తన మైల్స్టోన్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. తెలుగులో తన తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తర్వాత వందో చిత్రం మైలురాయిని అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు.;
సోలో హీరోగా బిజీగా ఉన్న టైములోనే క్యారెక్టర్స్ వైపు టర్న్ అయ్యాడు కింగ్ నాగార్జున. ఒకేసారి తమిళ తలైవా రజనీకాంత్ 'కూలీ', విలక్షణ నటుడు ధనుష్ 'కుబేరా' చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. 'కుబేరా' ఈనెలలో వస్తుండగా.. 'కూలీ' ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రానుంది.
ప్రస్తుతం నాగార్జున తన మైల్స్టోన్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. తెలుగులో తన తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తర్వాత వందో చిత్రం మైలురాయిని అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈకోవలోనే తన ప్రెస్టేజియస్ హండ్రెడ్త్ మూవీ కోసం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాడట.
నాగార్జున వందో చిత్రంకోసం దర్శకుడిగా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. లేటెస్ట్ గా కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తో నాగార్జున చర్చలు జరుపుతున్నాడట. స్టోరీ, స్క్రీన్ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో ఇది కచ్చితంగా ఓ పాన్ ఇండియా స్థాయి సినిమా అయ్యే అవకాశముందని టాక్.
ఈ భారీ సినిమా కోసం గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలైందని సినీ వర్గాల్లో చర్చ. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఆగస్టు 29 నాగార్జున పుట్టినరోజున అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట.