'గేమ్ ఛేంజర్' గురించి దిల్రాజు కామెంట్స్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందిన భారీ పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందిన భారీ పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం, నెగటివ్ టాక్ కారణంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.250 కోట్ల మేర నష్టాన్ని మిగిల్చినట్టు సమాచారం.
తాజాగా నిర్మాత దిల్ రాజు 'గేమ్ ఛేంజర్' గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ''గేమ్ ఛేంజర్' నా కెరీర్లో చేసిన అతి పెద్ద తప్పు' అని ఆయన స్పష్టం చేశారు. శంకర్ వంటి పెద్ద దర్శకుడితో పనిచేసినప్పుడు, నిర్మాతగా కొన్ని కీలక నిబంధనలు కాంట్రాక్ట్లో పొందుపరచకపోవడమే తన అతిపెద్ద పొరపాటు అని అంగీకరించారు.
ఈ సినిమాకు సంబంధించి దిల్ రాజు తెలిపిన ప్రధాన అంశాలు. ఫస్ట్ కట్ రన్టైమ్ నాలుగు గంటలకు పైగా ఉండేదని, ఎడిటింగ్లో ఎన్నో కట్స్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. నిర్మాతగా ఉన్నా కూడా, పెద్ద దర్శకుడి ప్రాధాన్యత కారణంగా ఫైనల్ కంటెంట్ పై నియంత్రణ లేకపోవడం, ఫలితంగా కథా బలం తగ్గడం జరిగినదని వెల్లడించారు. మిగిలిన చిత్రాలతో పోలిస్తే, తన కెరీర్లో ఇదే తీవ్రంగా నష్టాన్ని మిగిల్చిన సినిమాగా తెలిపారు.
ప్రస్తుతం దిల్ రాజు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘తమ్ముడు’పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. అలాగే, గతంలో అల్లు అర్జున్తో అనౌన్స్ చేసిన ‘ఐకాన్’ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని, త్వరలో మరో హీరోతో ఆ కథను తెరకెక్కించనున్నట్టు వెల్లడించారు.