'విశ్వంభర' కోసం భీమ్స్!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సోషియో ఫాంటసీ 'విశ్వంభర' చివరి దశలో ఉంది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది.;
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సోషియో ఫాంటసీ 'విశ్వంభర' చివరి దశలో ఉంది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ మొత్తం పూర్తైన ఈ సినిమాలో ఒక్క స్పెషల్ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. అది ఓ మాస్ నంబర్ అని తెలుస్తోంది. అసలు ఈ పాటను మొదట కీరవాణి స్వరపరచగా, చిరంజీవికి పూర్తి స్థాయిలో నచ్చలేదనేది ఫిల్మ్ నగర్ టాక్.
దీంతో చివరికి యంగ్ మ్యూజికల్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియోను రంగంలోకి దించారట. ఈ సినిమాకోసం భీమ్స్ ఆ స్పెషల్ మాస్ నంబర్ ను ఇప్పటికే అందించినట్టు తెలుస్తోంది. 'మెగా 157'కి కూడా భీమ్స్ సంగీత దర్శకుడు కావడంతో.. చిరు రిక్వెస్ట్ మేరకు 'విశ్వంభర' కోసం ఆన్ బోర్డులోకి వచ్చాడట భీమ్స్.
మరోవైపు కీరవాణి ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. జూలై రిలీజ్ టార్గెట్గా పెట్టుకున్న 'వీరమల్లు' చిత్రానికి బీజీఎమ్ చేయడం వల్ల ఆయనకు టైమ్ కేటాయించడం కష్టంగా మారిందని.. అందుకే భీమ్స్ 'విశ్వంభర' పాటను కంపోజ్ చేశాడు అనే మరో కథనం వినిపిస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ పూర్తైన తర్వాత ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదట్లో 'విశ్వంభర'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందట టీమ్.