‘ఆ నలుగురు’ గురించి దిల్ రాజు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘ఆ నలుగురు‘ అనే పదం చుట్టూ మళ్లీ చర్చలు రగులుతున్నాయి. ఇటీవల థియేటర్లు బంద్‌ అన్న ప్రకటన నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి స్పందన రావడం, ఈ అంశాన్ని మరింత హైలైట్‌ చేసింది.;

By :  S D R
Update: 2025-05-26 12:15 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘ఆ నలుగురు‘ అనే పదం చుట్టూ మళ్లీ చర్చలు రగులుతున్నాయి. ఇటీవల థియేటర్లు బంద్‌ అన్న ప్రకటన నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి స్పందన రావడం, ఈ అంశాన్ని మరింత హైలైట్‌ చేసింది. దీనిపై ప్రముఖ నిర్మాతలు ఒకొక్కరిగా స్పందిస్తున్నారు.

అల్లు అరవింద్ మొదటగా స్పందించి, ‘ఆ నలుగురిలో‘ తాను లేనని, ఇప్పుడు నలుగురు కాదు, పరిశ్రమను ప్రభావితం చేసే వారు 10 మందికిపైగా ఉన్నారని అన్నారు. తర్వాత దిల్ రాజు కూడా క్లారిటీ ఇచ్చారు. నైజాంలో మొత్తం 370 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నా, తాము నిర్వహిస్తున్నవి కేవలం 30 మాత్రమేనని తెలిపారు. అలాగే ఈమధ్య వార్తల్లో వస్తున్నట్టు, ‘ఆ నలుగురు‘ అన్నది వ్యక్తిగత దాడిలా ఉందని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News