'భైరవం' ట్విట్టర్ రివ్యూ

బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భైరవం’. కె కె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు (మే 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో 'భైరవం' ప్రీమియర్స్ పడ్డాయి.;

By :  S D R
Update: 2025-05-30 02:55 GMT

బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భైరవం’. కె కె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు (మే 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో 'భైరవం' ప్రీమియర్స్ పడ్డాయి. ఈనేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉందో? ఈ ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

చాలా కాలం తర్వాత తెలుగులో వచ్చిన మల్టీస్టారర్ ఇది. ముగ్గురు హీరోలు కలిసి ప్రమోషన్లలో పాల్గొనడంతో సినిమాపై హైప్ బాగా పెరిగింది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి పాజిటివ్ రివ్యూలు వస్తుండగా, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌పై నెటిజన్ల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు, ముగ్గురు నటుల నటన సినిమా హైలైట్స్‌గా చెబుతున్నారు.

స్నేహం, కుటుంబ బంధాలు, గ్రామీణ రాజకీయాల చుట్టూ తిరిగే కథ ఇది. ముగ్గురు కీలక పాత్రలైన శీను, గజపతి, వరదల పాత్రల్లో నటించిన ముగ్గురు హీరోలు తమ నటనతో ఆకట్టుకున్నారనే ప్రశంసలు దక్కుతున్నాయి. బెల్లంకొండ, మనోజ్, రోహిత్ ప్రధాన పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మనోజ్ రీ-ఎంట్రీ హైలైట్ అని చెబుతున్నారు. అయితే సెకండ్ హాఫ్ బలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు అంతగా ఇంపాక్ట్ కలిగించలేదని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.

విజయ్ కనకమేడల ఇప్పటికే 'నాంది', 'ఉగ్రం' వంటి సినిమాలతో తన మేకింగ్ స్టైల్‌కు పేరుగాంచాడు. 'భైరవం'తో మరో హిట్ కొట్టినట్టు ఫీలింగ్ సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. రీమేక్ అయినప్పటికీ, కథలో ఆసక్తికరమైన ట్విస్టులు, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి అంటున్నారు.

ఈ సినిమా ముగ్గురు హీరోలకు కీలకంగా మారింది. మనోజ్ కోసం ఇది రీ ఎంట్రీ సినిమా కాగా, శ్రీనివాస్‌కు ‘రాక్షసుడు’ తర్వాత మళ్లీ హిట్ అవసరమైన టైమ్‌లో వచ్చింది. నారా రోహిత్ కూడా చాలా కాలం తర్వాత ఈ సినిమాతో బరిలోకి దిగారు. అందుకే, 'భైరవం' విజయం ఈ ముగ్గురికీ కొత్త దిశగా మారే అవకాశముంది.

Tags:    

Similar News