పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు సీరీయస్
పంచాయతీ ఎన్నికల వెంటనే జరిపించాలి అని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు;
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
సర్పంచుల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసినప్పటికీ కూడా ఇప్పటికీ గ్రామీణ ఎన్నికలు జరపకపోవడం ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గోర తప్పిదంగా బీజేపీ పార్టీ విమర్శిస్తూనే ఉంది.పంచాయతీ ఎన్నికలు జరగక పోవటం వల్ల రాష్ట్రానికి రూ.2,300 కోట్లు పైగా కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు. ప్రజా నిధులను తెచ్చుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జడ్పీ-ఎంపీటీసీల గడువు పూర్తై 6 నెలలు దాటినా ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు. ఇది ప్రజాస్వామ్య పరిపాలనను మట్టికరిపించడం కదా అని బీజేపీ ప్రశ్నిస్తుంది.
భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూనే ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది.స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడంవల్ల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. పథకాలు నిలిచిపోయాయి. ప్రజలకు నేరుగా లబ్ధి కలిగే కేంద్ర పథకాలు నిలిచిపోయాయి,ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-E మరియు 243-Kకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యగా బీజేపీ విమర్శిస్తోంది. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని నెరవేర్చకుండా కేంద్రంపై నెపం నెట్టే నాటకాలు ఆడటం దారుణం. ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేయడం, బీసీలను మోసం చేయడం గురించే అని కమలం పార్టీ ఆరోపిస్తుంది.
బీఆర్ఎస్ హయాంలో సర్పంచులకు జరిగిన అన్యాయం ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ పునరావృతమవుతోంది అని.
కళ్యాణలక్ష్మి తులం బంగారం ఊసు లేదు, రూ.2,500 మహిళలకు ఆర్థిక సాయం అందలేదు. ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక జరగలేదు, విద్యా భరోసా కార్డు లేదు, వృద్ధుల/దివ్యాంగుల పింఛన్ రూ.4000 కాలేదు, నిరుద్యోగ భృతి రూ. 4 వేలు అందలేదు, రుణమాఫీ, రైతు భరోసా పూర్తిస్థాయిలో జరగలేదు. రాజీవ్ యువవికాసాన్ని అటకెక్కించారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలపై భయం పెరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతోంది అంటుంది బీజేపీ.
హైకోర్టు చెప్పేవరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత గుర్తు రాలేదు.గతంలోనూ పలు సందర్భాల్లో కోర్టు ఆదేశాలను గౌరవించకుండా వ్యవహరించిన ప్రభుత్వానికి ఇదీ మరో ఉదాహరణ.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు తీర్పు మేరకు వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను అమలు చేయాలి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజల ఓటుకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుతో అయినా కళ్లు తెరుచుకొని సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తుంది ఏమో చూడాలి.