వైసీపీ మద్యం కుంభకోణంలో సిట్ ముందడుగు చెవిరెడ్డి కుమారుడికి నోటీసులు
మనీ లాండరింగ్లో చెవిరెడ్డి కుమారుడు హస్తం ఉందని గుర్తించిన సిట్;
మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని A -36 గా చేర్చి బుధవాం విచారణకు హాజరు కావాలి అని సిట్ అధికారులు నోటీసులు జారీచేశారు.ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు.
మోహిత్ రెడ్డి A -36 గా చేర్చడానికి గల కారణాన్ని సిట్ బృందం వివరించింది,వసూలు చేసిన నగదును విదేశాలకు తరలించే ప్రక్రియలో చెవిరెడ్డి పాత్ర ఉందన్నది సిట్ బృందం ఆరోపణ.మద్యం కుంభకోణం కేసులో ఇతర దేశాలలో మనీ లాండరింగ్ చేసారు అని తమకు ఆదారాలు ఉన్నాయి అని ప్రత్యేక బృందం ఆరోపిస్తుంది.
తనను అరెస్ట్ చేస్తారు అని ముందే గ్రహించిన మోహిత్ రెడ్డి హైకోర్టు లో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయడంతో పాటు, తన మీద ఆరోపించిన నేరాన్ని కూడా కొట్టివేయాలి అని కోర్టుని అభ్యర్ధించారు.ప్రస్తుతం మోహిత్ రెడ్డి అగ్యతం లో ఉన్నట్టు తెలుస్తుంది.సిట్ బృందం ప్రస్తుతం మోహిత్ గురించి గాలిస్తుంది.