మహా న్యూస్ ఛానెల్పై దాడి గర్హనీయం – పవన్ కళ్యాణ్ తీవ్ర ఖండన
తెలంగాణ ప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి... మీడియా దాడి కేసులో చర్యలు తీసుకోండి;
హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి అత్యంత గర్హనీయం మరియు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు.. మీడియా ఏదైనా వార్తను ప్రసారం చేసినప్పుడు లేదా కథనాన్ని ప్రచురించినప్పుడు, దానికి వ్యతిరేకంగా అభ్యంతరాలు ఉంటే, వాటిని వ్యక్తీకరించడానికి చట్టబద్ధమైన, ప్రజాస్వామ్యపరమైన మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి అని గుర్తు చేసారు.
దానికి భిన్నంగా, మీడియా సంస్థలపై దాడులకు పాల్పడటం అనాగరికం మరియు తీవ్రంగా ఖండించదగిన చర్య. ఇది కేవలం ఒక మీడియా సంస్థపై దాడి మాత్రమే కాదు, స్వేచ్ఛాయుత పాత్రికేయ విలువలపై కూడా ముప్పు వాటిల్లే విధంగా ఉన్నది అన్నారు పవన్..
మహా న్యూస్ ఛానెల్పై జరిగిన దాడిని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖచ్చితంగా ఖండించాలి. ఈ దాడికి కారణమైన వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలియచెసారు..మీడియా స్వేచ్ఛను కాపాడే విషయంలో మనమందరం ఒకటిగా ఉండాలి అని పవన కళ్యాణ్ హితవు పలికారు.