కాపీరైట్ ఉల్లంఘనపై జీ 5 క్లారిటీ !

"విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్" దాని స్క్రిప్ట్ రైటర్‌పై కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలతో కేసు దాఖలు చేశారు.;

By :  K R K
Update: 2025-06-28 04:16 GMT

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5.. ‘విరాటపాలెం : పీసీ మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ కేసుకు సంబంధించిన వివాదంపై అధికారిక స్పష్టీకరణ జారీ చేసింది. ఈ విషయంపై జీ5 క్లారిఫికేషన్ ఇచ్చింది. ప్రశాంత్ దిమ్మల అనే వ్యక్తి.. తమ తెలుగు ఒరిజినల్ సిరీస్ "విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్" దాని స్క్రిప్ట్ రైటర్‌పై కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలతో కేసు దాఖలు చేశారు. ఈ విషయం కోర్టులో ఉన్నప్పటికీ, ఆయన పత్రికా సమావేశం నిర్వహించి, కోర్టు తీర్పు వచ్చే వరకు పబ్లిక్‌గా మాట్లాడకూడదని తెలిసినప్పటికీ, బహిరంగంగా ప్రకటనలు చేశారని జీ5 గుర్తించింది.

జీ5 స్పష్టం చేస్తూ, 25.06.25 తేదీన జారీ అయిన కోర్టు తాత్కాలిక ఉత్తర్వును పాటిస్తూ, తమ నిజాయితీని చూపించేందుకు, ప్రశాంత్ దిమ్మలకు సిరీస్‌ను ముందుగా చూసే అవకాశం కల్పించింది. ఇది ఆయన స్క్రిప్ట్‌తో ఎలాంటి సారూప్యత ఉందో స్వయంగా అంచనా వేసేందుకు వీలు కల్పించింది. అయినప్పటికీ, ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా, ప్రశాంత్ దిమ్మల మరియు ఇతరులు లైవ్ మీడియా సమావేశం నిర్వహించి, జీ5పై దుష్ప్రచారం చేశారు.

జీ5 ఒరిజినల్ సిరీస్ "విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్"పై ప్రశాంత్ దిమ్మల చేసిన ఆరోపణలను జీ5 ఖండించింది. కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండానే ఈ ఆరోపణలు చేయడం ద్వారా, జీ5 ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నించినట్లు జీ5 భావిస్తోంది. ఈ చర్యలను బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా పరిగణిస్తూ, దిమ్మల మరియు అతని సహచరులపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు జీ5 తెలిపింది.

Tags:    

Similar News

Bigg Boss' is coming back!