ఓటీటీలోకి రాబోతున్న సూర్య ‘రెట్రో’
‘రెట్రో’ నెట్ఫ్లిక్స్లో విడుదలవుతుందని చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ఈ ఓటీటీ దిగ్గజం మే 31, 2025 నుంచి స్ట్రీమింగ్ కోసం తేదీని ఖరారు చేసింది.;
తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్లో అతిపెద్ద ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
‘రెట్రో’ నెట్ఫ్లిక్స్లో విడుదలవుతుందని చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ఈ ఓటీటీ దిగ్గజం మే 31, 2025 నుంచి స్ట్రీమింగ్ కోసం తేదీని ఖరారు చేసింది. సోషల్ మీడియాలో నెట్ఫ్లిక్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సూర్య, పూజా హెగ్డే నటించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో రాబోయే చిత్రాల విభాగంలో జాబితా చేయబడింది.
‘రెట్రో’ కథ పారి అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. సూర్య, పూజా హెగ్డే, జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాశ్ రాజ్, కరుణాకరన్, స్వసిక, రమ్య సురేష్ తదితరులు నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్య, అతని భార్య జ్యోతిక, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.