చాలా లేట్ గా ఓటీటీలోకి రజనీకాంత్ చిత్రం
లాల్ సలామ్ బక్రీద్ సందర్భంగా జూన్ 6 లేదా 7వ తేదీల్లో సన్ నెక్స్ట్ ప్లాట్ఫామ్లో డిజిటల్గా విడుదల కానుంది. మొదట్లో నెట్ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. కానీ తర్వాత అవి సన్ నెక్స్ట్కు బదిలీ అయింది.;
సూపర్స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రం ‘కూలీ’ విడుదల కోసం సిద్ధమవు తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. అలాగే, రజనీ హీరోగా నటించిన ‘జైలర్ 2’ మూవీ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. గత ఏడాది.. రజనీ నటించిన ‘లాల్ సలామ్’ సినిమా థియేటర్లలో విడుదలైంది. కానీ దురదృష్ట వశాత్తూ అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ చిత్రానికి రజనీ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటించారు.
అయితే.. ‘లాల్ సలామ్’ ఇప్పటికీ ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రాలేదు. గతంలో ఐశ్వర్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో... సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు ఉన్న ఒక కీలక హార్డ్ డిస్క్ పోవడం వల్ల ఓటీటీ విడుదల ఆలస్యమైందని వెల్లడించారు. ఆ హార్డ్ డిస్క్ కొన్ని నెలల క్రితం తిరిగి పొందినప్పటికీ.. ఓటీటీ విడుదల గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు.
ఎట్టకేలకు లాల్ సలామ్ బక్రీద్ సందర్భంగా జూన్ 6 లేదా 7వ తేదీల్లో సన్ నెక్స్ట్ ప్లాట్ఫామ్లో డిజిటల్గా విడుదల కానుంది. మొదట్లో నెట్ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. కానీ తర్వాత అవి సన్ నెక్స్ట్కు బదిలీ అయింది. థియేటర్లలో ఈ సినిమాను చాలామంది చూడనందున.. ఓటీటీలో మంచి వ్యూయర్ షిప్ ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, జీవిత రాజశేఖర్, తంబి రామయ్య, అనంతిక సనీల్కుమార్, వివేక్ ప్రసన్న, తంగదురై వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందించగా, లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.