ఓటీటీలోకి వస్తోన్న ‘కన్నప్ప’!
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా రూపొందిన డివోషనల్ డ్రామా ‘కన్నప్ప’ జూన్ 27న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ అందుకుని.. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.;
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా రూపొందిన డివోషనల్ డ్రామా ‘కన్నప్ప’ జూన్ 27న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ అందుకుని.. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటించగా.. అతిథి పాత్రల్లో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కనిపించారు.
ఈ సినిమా క్లైమాక్స్ లో మంచు విష్ణు నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. అయితే.. 'కన్నప్ప'కి ఎంత పాజిటివిటీ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో అది తర్జుమా జరగలేదు అనే ప్రచారం కూడా ఉంది. ప్రభాస్ రుద్ర పాత్రలో చేసిన స్పెషల్ అప్పియరెన్స్, రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక ప్రదర్శన వంటి హైలైట్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
లేటెస్ట్ గా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుందట. జూలై 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి రానున్నట్టు టాక్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుందట. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.