గాయని సునీతపై తీవ్ర ఆరోపణలు !
ఈ కార్యక్రమం నుంచి తొలగించబడిన కంటెస్టెంట్ ప్రవస్తి ఆరాధ్య ఒక వీడియో విడుదల చేస్తూ గాయని సునీత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్పై ఆరోపణలు చేసింది.;
ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో 'పాడుతా తీయగా'లో న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న గాయని సునీతపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ కార్యక్రమం నుంచి తొలగించబడిన కంటెస్టెంట్ ప్రవస్తి ఆరాధ్య ఒక వీడియో విడుదల చేస్తూ గాయని సునీత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్పై ఆరోపణలు చేసింది.
ప్రవస్తి మాట్లాడుతూ.. తనకు కీరవాణి నుండి ఎలాంటి వేధింపులు ఎదురు కాలేనప్పటికీ.. మెలోడియస్ పాటలు పాడినవారికే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించింది. అలాగే తను స్వరపరిచిన పాటలు పాడినవారిపై కీరవాణి ప్రత్యేక దృష్టి చూపించారని ఆరోపించింది.
ఇక చంద్రబోస్ విషయానికి వస్తే.. తను రచించిన పాటలు పాడిన కంటెస్టెంట్ల తప్పులను పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోయారని ప్రవస్తి ఆరోపించింది. అయితే గాయని సునీతపై ప్రవస్తి తీవ్ర ఆరోపణలు గుప్పించింది. సునీత తనపై మానసికంగా వేధింపులకు పాల్పడిందని, మాటల్లో అవమానించిందని ఆరోపించింది. సునీత తన పట్ల ద్వేష భావంతో వ్యవహరించి, తనను షో నుంచి తొలగించబడడానికి కారణమైందని ప్రవస్తి ఆరోపించారు.
గమనించదగ్గ విషయం ఏమంటే.. 'పాడుత తీయగా' అనే కార్యక్రమాన్ని గతంలో దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఎంతో సుందరంగా ఆత్మీయతతో నడిపించారు. ఆయన అనంతరం ఈ కార్యక్రమం కొనసాగుతుండగా ఇప్పుడు ఇలా వివాదాలు చెలరేగడం చర్చనీయాంశమైంది.