బాలీవుడ్ లో నాలుగు ప్రాజెక్ట్స్ తో బిజీ !
రాశి బాలీవుడ్లో కూడా అంతే బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు కలిపి మొత్తం నాలుగు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి.;
అందాల హీరోయిన్ రాశి ఖన్నా టాలీవుడ్ లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. నెక్స్ట్ వీక్ ఆమె సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించిన “తెలుసు కదా” రిలీజ్ కాబోతోంది. దీంతో పాటు, ఆమె తన కెరీర్లోనే బిగ్గెస్ట్ తెలుగు ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ కూడా ఫినిష్ చేసింది. ఇందులో ఆమె పవన్ కళ్యాణ్ సరసన మెయిన్ లీడ్ గా చేస్తోంది.
ఇలా టోలీవుడ్లో తనను తాను రీ-ఎస్టాబ్లిష్ చేసుకుంటూనే.. రాశి బాలీవుడ్లో కూడా అంతే బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు కలిపి మొత్తం నాలుగు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న సౌత్ యాక్ట్రెస్లలో రాశి ముందు వరుసలో ఉంటుంది. ‘తెలుసు కదా’ గురించి మాట్లాడుతూ.. రాశి డైరెక్టర్ నీరజ కోన స్టోరీ టెల్లింగ్ను బాగా అప్రిషియేట్ చేసింది.
"ముగ్గురు లీడ్స్ ఒకరితో ఒకరు ఏమాత్రం పోలిక లేకుండా చాలా యూనిక్గా ఉంటారు. అలాంటి డిస్టింక్ట్ పర్సనాలిటీస్ మధ్య బ్యాలెన్స్ చేయడం ఈజీ కాదు. నేను చాలా లవ్ స్టోరీస్ చేశాను, కానీ ఇది మాత్రం నిజంగా వాటి కంటే స్పెషల్గా ఉంటుంది," అని ఆమె చెప్పింది. ప్రొఫెషనల్గా తను హ్యాపీ స్పేస్లో ఉన్నానని రాశి యాడ్ చేసింది. "నాకు వస్తున్న ప్రాజెక్టుల విషయంలో నేను కంటెంట్గా ఉన్నాను," అని ఆమె కాన్ఫిడెంట్గా చెప్పింది.