డబ్బింగ్ పూర్తి చేసిన ‘వీరమల్లు’ !

పవన్ కల్యాణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. బిజీ షెడ్యూల్ మధ్యలోనూ, రాత్రి 10 గంటలకు షూటింగ్ ముగించిన తర్వాత డబ్బింగ్ ప్రారంభించి, కేవలం నాలుగు గంటల్లో పూర్తి చేశారు.;

By :  K R K
Update: 2025-05-29 13:20 GMT

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘హరి హర వీర మల్లు’ జూన్ 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. చాలా సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రంపై నిర్మాత ఏఎం రత్నం ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాని జ్యోతి కృష్ణ అండ్ క్రిష్ జాగర్లమూడి కలిసి దర్శకత్వం వహించారు. ఇన్నేళ్ళు లేట్ అయినప్పటికీ.. ఈ మూవీపై అంచనాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

తాజా అప్‌డేట్ ప్రకారం... పవన్ కల్యాణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. బిజీ షెడ్యూల్ మధ్యలోనూ, రాత్రి 10 గంటలకు షూటింగ్ ముగించిన తర్వాత డబ్బింగ్ ప్రారంభించి, కేవలం నాలుగు గంటల్లో పూర్తి చేశారు. డబ్బింగ్ సెషన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసేందుకు చిత్ర బృందం రాత్రింబవళ్లు కష్టపడుతోంది. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ డియోల్, నాజర్, సత్యరాజ్, సునీల్, దలీప్ తాహిల్, సచిన్ ఖేడేకర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags:    

Similar News