హైదరాబాద్ లో షూటింగ్ రీస్టార్ట్ చేసింది !
ఈ సినిమా షూటింగ్ ను ఆమె గతంలో కొంత భాగం పూర్తి చేసి.. కాస్త లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ మోస్ట్-అవైటెడ్ ఫిల్మ్ కోసం రీచార్జ్ అయిపోయి.. హైదరాబాద్లో షూటింగ్ స్టార్ట్ చేసేసింది.;
బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ మళ్లీ షూటింగ్ రీస్టార్ట్ చేసేసింది. అడివి శేష్తో కు జోడీగా నటిస్తున్న సూపర్ ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీ “డెకాయిట్” కోసం ఆమె ఫుల్ జోష్లో ఉంది. ఈ సినిమా షూటింగ్ ను ఆమె గతంలో కొంత భాగం పూర్తి చేసి.. కాస్త లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ మోస్ట్-అవైటెడ్ ఫిల్మ్ కోసం రీచార్జ్ అయిపోయి.. హైదరాబాద్లో షూటింగ్ స్టార్ట్ చేసేసింది.
ఈ ప్రాజెక్ట్ మొదట్లో అడివి శేష్, శృతి హాసన్ లీడ్ జంటగా కిక్స్టార్ట్ అయింది. కానీ.. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా శ్రుతి ఈ సినిమా నుంచి ఔట్ అయింది. అప్పుడు మృణాళ్ ఠాకూర్ను టీమ్ ఆన్బోర్డ్ చేసుకుంది. మృణాళ్ తన ఇన్స్టాగ్రామ్లో స్టైలిష్ పిక్ షేర్ చేస్తూ... హైదరాబాద్కు చేరుకుని షూటింగ్లో జాయిన్ అయినట్లు కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం లీడ్ పెయిర్కి సంబంధించిన కొన్ని కీలక సీన్స్ను షూట్ చేస్తున్నారు. “డెకాయిట్” సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో టాలీవుడ్ లోకి డైరెక్టర్గా అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 25, 2025న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.
ఈ మూవీ అడివి శేష్ రైటింగ్ స్కిల్స్తో పాటు, షానీల్ డియో విజువల్ మ్యాజిక్ను కలిపి ఓ డిఫరెంట్ ఫ్లేవర్ను ఆడియన్స్కు అందించబోతోందని టాక్. ఇదిలా ఉంటే, మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాతో పాటు ఇంకా పలు బిగ్ ప్రాజెక్ట్లతో సూపర్ బిజీగా ఉంది. బాలీవుడ్లో “సన్ ఆఫ్ సర్దార్ 2” సీక్వెల్తో ఫుల్ స్వింగ్లో ఉంది. అంతేకాదు, అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్తో కలిసి ఓ మాసివ్ పాన్-ఇండియా మూవీలోనూ నటిస్తోంది. ఈ రెండు ఇండస్ట్రీల్లోనూ తన టాలెంట్తో రాణిస్తూ, మృణాళ్ ఫుల్ ఫామ్లో ఉందని చెప్పొచ్చు.