ముంబైలో లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ
అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు, గ్లోబల్ నటీనటులు పాల్గొనే సన్నివేశాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళిక వేశారు. అందుకే, ముంబై షెడ్యూల్ నిరంతరాయంగా చిత్రీకరణతో కొనసాగుతోంది.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం షూటింగ్ గత కొద్ది నెలలుగా ముంబైలో జరుగుతోంది. బృందం మధ్యలో అప్పుడప్పుడు విరామాలు తీసుకుంటున్నప్పటికీ, షెడ్యూల్స్కు పెద్దగా ఆటంకాలు కలగడం లేదు , అలాగే.. లాంగ్ బ్రేకులు కూడా ఇవ్వడం లేదు.
దర్శకుడు అట్లీ ప్రధానమైన సైన్స్ ఫిక్షన్ భాగాలు, అలాగే అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు, గ్లోబల్ నటీనటులు పాల్గొనే సన్నివేశాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళిక వేశారు. అందుకే, ముంబై షెడ్యూల్ నిరంతరాయంగా చిత్రీకరణతో కొనసాగుతోంది.
ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, స్టంట్మెన్ బృందం ముంబైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ వారం వారం హైదరాబాద్ నుండి ముంబైకి ప్రయాణాలు చేస్తూ షూటింగ్లో పాల్గొంటున్నారు.
సౌత్ ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా చెబుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ఇందులో దీపికా పదుకొణె ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా, మృణాల్ ఠాకూర్ వంటి నటీమణులు తర్వాత షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లో అగ్రశ్రేణి హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలు కూడా పాలుపంచుకుంటున్నాయి.