రీఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి బ్యూటీస్
2000లలో టాలీవుడ్ స్క్రీన్ను ఏలిన కొందరు స్టార్ హీరోయిన్లు ఈ ఏడాది మళ్లీ కెమెరా ముందుకొస్తున్నారు. వీళ్ల కథలు కేవలం సినిమాల గురించే కాదు.. విరామం , ఫ్యామిలీ లైఫ్, కొత్త ప్రారంభం గురించి కూడా.;
సినిమా రంగం ఒక నిజమైన యాక్టర్ ని ఎప్పటికీ వీడదు. సంవత్సరాలు గడిచినా, “లైట్స్, కెమెరా, యాక్షన్” అనే పిలుపు చాలా మందిని తిరిగి స్పాట్లైట్లోకి లాగుతుంది. 2000లలో టాలీవుడ్ స్క్రీన్ను ఏలిన కొందరు స్టార్ హీరోయిన్లు ఈ ఏడాది మళ్లీ కెమెరా ముందుకొస్తున్నారు. వీళ్ల కథలు కేవలం సినిమాల గురించే కాదు.. విరామం , ఫ్యామిలీ లైఫ్, కొత్త ప్రారంభం గురించి కూడా.
మొదటగా లిస్ట్ లో ఉన్న అప్పటి హీరోయిన్ శ్రీదేవి విజయకుమార్. ప్రభాస్ సరసన ‘ఈశ్వర్’ తో డెబ్యూ చేసిన ఆమె.. పెళ్లి, ఫ్యామిలీ కారణంగా సినిమాలకు దూరమైంది. ఇప్పుడు నారా రోహిత్తో ‘సుందరకాండ’ లో లీడ్ హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తోంది.
అలాగే, 90లలో తన ఎనర్జిటిక్ డాన్స్ నంబర్స్తో రచ్చ చేసిన డిస్కో శాంతి.. లాంగ్ గ్యాప్ తర్వాత ‘బుల్లెట్ బండి’ లో పవర్ఫుల్ రోల్తో సర్ప్రైజ్ చేస్తోంది. ఈ రీఎంట్రీలు చూస్తే, టైమ్ పాస్ అయినా స్క్రీన్ మ్యాజిక్ ఎప్పటికీ డల్ కాదని అర్థమవుతుంది.
అశోక్, జై చిరంజీవ సినిమాలతో ఫ్యాన్స్ హృదయాల్లో స్థానం సంపాదించింది సమీరా రెడ్డి. పిల్లల కోసం లాంగ్ బ్రేక్ తీసుకున్న ఆమె, ఇప్పుడు ‘చిమ్నీ’ అనే హారర్-థ్రిల్లర్తో బ్యాక్ అవుతోంది. ఈ సినిమాలో ఒకే క్యారెక్టర్లో మూడు డిఫరెంట్ షేడ్స్లో కనిపించబోతోంది.
ఒకప్పుడు గ్లామర్తో స్క్రీన్ను ఫైర్ చేసిన అందాల రంభ... టీవీలో ట్రై చేసిన తర్వాత ఇప్పుడు మళ్లీ బిగ్ స్క్రీన్పై రీఎంట్రీ ఇచ్చే సైన్స్ చూపిస్తోంది. ఈ నలుగురూ నాస్టాల్జియాను తిరిగి తెస్తూ, ఫ్యాన్స్లో కొత్త క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు.
ఒకప్పుడు ఈ నటీ మణుల్ని చూసి కేరింతలు కొట్టిన ఫ్యాన్స్ ఇప్పుడు కొత్త ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. సినిమాలు హిట్ అవుతాయో లేదో అనేది సెకండరీ. సినిమా రంగంలోకి మళ్లీ అడుగు పెట్టడమే ఒక సెలబ్రేషన్ లాంటిది. ఈ నలుగురు స్టార్స్ ఒకటి నిరూపిస్తున్నారు. టాలీవుడ్లో వయస్సు లేదా గ్యాప్ ఒక జర్నీని ఆపలేదు.అది కేవలం కొత్త చాప్టర్ను యాడ్ చేస్తుంది.