మిస్టికల్ వరల్డ్‌ లోకి తీసుకెళ్లే 'శంబాల'!

Update: 2025-06-07 10:30 GMT

కెరీర్ ప్రారంభంలో మాస్, రొమాంటిక్ చిత్రాలతో ప్రయోగాలు చేసిన హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు వరుసగా వైవిధ్యభరిత సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అతని ప్రయత్నాలు బాగున్నా.. విజయాలే దక్కడం లేదు. ‘షణ్ముఖ‘ వంటి డిఫరెంట్ థ్రిల్లర్ తర్వాత ఇప్పుడు ‘శంబాల‘ అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

Full View

ఆధ్యాత్మికతతో కూడిన సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ‘శంబాల‘ రూపొందుతుంది. ‘శంబాలా‘ సినిమా కథ ఒక ఊహాజనిత ప్రపంచం చుట్టూ తిరుగుతుందని చిత్రబృందం చెబుతుంది. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతుండగా, అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ మోషన్ పోస్టర్, మేకింగ్ వీడియోలకు మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేశారు.

‘శంబాల‘.. ఎ మిస్టికల్ వరల్డ్ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ మూవీ టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఆద్యంతం మిస్టికల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు ఓ థ్రిల్ ఎక్స్పీరియన్స్ ను ఈ చిత్రం అందించబోతున్నట్టు టీజర్ ను బట్టి తెలుస్తుంది. ‘ఏ-యాడ్ ఇన్‌ఫినిటిమ్’ ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

Tags:    

Similar News