పూజా కార్యక్రమాలతో పూరి-సేతుపతి!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో సినిమా గురించి ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ క్రేజీ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది.;

By :  S D R
Update: 2025-06-30 10:52 GMT

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో సినిమా గురించి ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ క్రేజీ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తాజాగా JB మోషన్ పిక్చర్స్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామిగా చేరింది. జెబి నారాయణరావు కొండ్రొల్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటించనుండగా, టబు, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుంది. హైదరాబాద్, చెన్నై లాంటి ప్రధాన లొకేషన్లలో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకు రాబోతున్నాడు పూరి జగన్నాథ్. ఈ సినిమాకి ‘బెగ్గర్’, ‘భవతి బిక్షాం దేహి’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ఇటీవల వరుస డిజాస్టర్లతో డీలాపడ్డ పూరి జగన్నాథ్ ఈ మూవీకి గ్రేట్ కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు.



Tags:    

Similar News