మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు !
మోహన్లాల్ తాజాగా శబరిమల యాత్ర చేశారు. ఈ సందర్బంగా... ఆయన తన కుటుంబ సభ్యులతో పాటు ఆప్తమిత్రుడు మమ్ముట్టి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.;
మలయాళ సూపర్ స్టార్స్ మోహన్లాల్, మమ్ముట్టి మాలీవుడ్ కు రెండు కళ్ళులాంటి వారని చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయ స్నేహం గురించి అందరికీ తెలుసు. తాజాగా... తన స్నేహితుడిపై ఉన్న అభిమానాన్ని మోహన్లాల్ మరోసారి ప్రదర్శించారు. తన కొత్త చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ రిలీజ్ను పురస్కరించుకొని మోహన్లాల్ తాజాగా శబరిమల యాత్ర చేశారు. ఈ సందర్బంగా... ఆయన తన కుటుంబ సభ్యులతో పాటు ఆప్తమిత్రుడు మమ్ముట్టి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం.. పూజా సమయంలో మోహన్లాల్ మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి అని ప్రస్తావించారట. ఈ విషయంపై సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మమ్ముట్టి అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆయన టీమ్ ఈ ప్రచారాన్ని ఖండించింది. ‘‘ఆయన ఆరోగ్యానికి ఎటువంటి హానీ లేదు. రంజాన్ సందర్భంగా షూటింగ్కు విరామం తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో మోహన్లాల్తో కలిసి కొత్త ప్రాజెక్ట్లో పాల్గొననున్నారు’’ అని క్లారిటీ ఇచ్చారు.
మోహన్లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఎల్2: ఎంపురాన్’ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, టొవినో థామస్, సాయికుమార్ సహా విదేశీ నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మోహన్లాల్-పృథ్వీరాజ్ కాంబినేషన్లో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం జరగనుంది.