'వీరమల్లు' బడ్జెట్ పై క్లారిటీ!

Update: 2025-06-07 10:10 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చారిత్రక చిత్రం ‘హరి హర వీరమల్లు’ మరోసారి వాయిదా పడింది. జూన్ 12న థియేటర్లలోకి రానుందని ముందు ప్రకటించినా, మళ్ళీ వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికావాల్సిన అవసరం ఉండటమే ఇందుకు కారణంగా మేకర్స్ తెలిపారు.

లేటెస్ట్ గా డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ, ఇది సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మహా ప్రాజెక్ట్ అని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు సార్లు ఈ సినిమా చూశారని.. మూవీ అవుట్ పుట్ పట్ల ఆయన చాలా ఆనందంగా ఉన్నారని జ్యోతికృష్ణ చెప్పారు.

చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో, పాత కాలపు వాతావరణాన్ని తెరపై యథాతథంగా ఆవిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని జ్యోతికృష్ణ తెలిపారు. సెట్టింగులు, కాస్ట్యూమ్స్, విజువల్స్ అన్నింటినీ అద్భుతంగా రూపొందించినట్టు వివరించారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విజయం సాధించిన తర్వాత తెరపై కనిపించే తొలి చిత్రం కావడం వల్ల, ‘హరి హర వీరమల్లు’పై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం విడుదలైనప్పుడు ఖచ్చితంగా రికార్డులు తిరగరాస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

మరోవైపు, ఈ సినిమా మీద ఫ్యాన్స్ లో ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. బుక్ మై షో (BMS) రిపోర్ట్ ప్రకారం, ఇప్పటికే 2 లక్షల మంది ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ఇంట్రెస్ట్స్ వచాయి. త్వరలోనే హరి హర వీరమల్లు పవర్ ఫుల్ ట్రైలర్‌ ను విడుదల చేస్తూ ఫైనల్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది

Tags:    

Similar News