'వీరమల్లు'లో సరికొత్తగా బాబీ డియోల్!

పవన్ కళ్యాణ్ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.;

By :  S D R
Update: 2025-06-30 11:07 GMT

పవన్ కళ్యాణ్ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ లు సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు మెగా సూర్య ప్రొడక్షన్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు.

మొదట ఈ చిత్రాన్ని క్రిష్ కొంతభాగాన్ని తెరకెక్కించగా.. ఆ తర్వాత జ్యోతికృష్ణ ఆన్ బోర్డులోకి వచ్చాడు. ఈ సినిమాలో జ్యోతికృష్ణ చేసిన మేజర్ ఛేంజెస్ లో బాబీ డియోల్ పోషించిన ఔరంగజేబు పాత్ర ఒకటి అట. ఆయన పాత్రను తొలుత చిత్రీకరించిన తర్వాత, ‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్ నటనను చూసిన దర్శకుడు జ్యోతి కృష్ణ ఆ పాత్రను పూర్తిగా రీడిజైన్ చేశాడట. ఔరంగజేబ్ క్యారెక్టర్‌ ను మరింత ఇంటెన్స్‌గా డిజైన్ చేసి.. ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను బాగా పెంచాడట జ్యోతికృష్ణ.

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగానూ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుందంటున్నాడు జ్యోతికృష్ణ. మొత్తంగా.. పవన్ కళ్యాణ్ 'వీరమల్లు' పాత్రలో చారిత్రక యోధుడిగా చేసే యుద్ధాలు, మేనరిజమ్స్ అన్నీ సరికొత్తగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు డైరెక్టర్ జ్యోతికృష్ణ.



Tags:    

Similar News