80s తారల రీయూనియన్‌

1980లలో చిత్ర సీమను ఏలిన తారలు ప్రతి ఏడాది ఆత్మీయంగా కలుసుకునే '80s స్టార్స్ రీయూనియన్‌' ఈసారి మరింత ఉత్సాహంగా, అద్భుతంగా సాగింది. అక్టోబర్‌ 4న చెన్నైలో జరిగిన ఈ వేడుకకు దక్షిణాది, ఉత్తరాది పరిశ్రమలకు చెందిన 31 మంది ప్రముఖ నటీనటులు హాజరై పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.;

By :  S D R
Update: 2025-10-05 07:55 GMT

1980లలో చిత్ర సీమను ఏలిన తారలు ప్రతి ఏడాది ఆత్మీయంగా కలుసుకునే '80s స్టార్స్ రీయూనియన్‌' ఈసారి మరింత ఉత్సాహంగా, అద్భుతంగా సాగింది. అక్టోబర్‌ 4న చెన్నైలో జరిగిన ఈ వేడుకకు దక్షిణాది, ఉత్తరాది పరిశ్రమలకు చెందిన 31 మంది ప్రముఖ నటీనటులు హాజరై పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఈసారి రీయూనియన్‌కు ఆతిథ్యమిచ్చిన వారు కోలీవుడ్ స్టార్ జంట రాజ్‌కుమార్‌ సేతుపతి – శ్రీప్రియ. వారి నివాసంలోనే 'చిరుత థీమ్‌'తో ఈ వేడుకను నిర్వహించారు. అందరు తారలు చీతా ప్రింట్‌ డ్రెస్సులతో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు. నవ్వులు, ఆటలు, పాటలు, డ్యాన్సులతో ఆత్మీయ వాతావరణంలో వేడుక సాగింది.

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, భాను చందర్, నరేష్ వంటి టాలీవుడ్‌ స్టార్స్ తో పాటు శరత్‌కుమార్‌, భాగ్యరాజ్, జాకీ ష్రాఫ్‌, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభన, ఖుష్బూ, సుహాసిని, రేవతి వంటి తారలు పాల్గొన్నారు. చిరంజీవి ఈ సందర్భంగా తన అనుభూతిని పంచుకుంటూ, '80s స్నేహితులతో ప్రతి రీయూనియన్‌ మధుర జ్ఞాపకాల వీధిలో నడకలా ఉంటుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా అనిపిస్తుంది' అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్‌ చేశారు.



Similar News