చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ డీల్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రికెట్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా నుంచి చరణ్ కొట్టిన ‘పెద్ది సిగ్నేచర్ షాట్’ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ మూవీలోని చరణ్ బాడీ లాంగ్వేజ్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ పై ఇంటర్నేషనల్ క్రికెటర్స్ సైతం ఫిదా అయ్యారు.
లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. దీని కోసం రూ. 105 కోట్ల భారీ మొత్తం చెల్లించి రికార్డు స్థాయిలో డీల్ను కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇది చరణ్ కెరీర్ లోనే హయ్యస్ట్ ఓటీటీ డీల్ గా ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన భారీ సెట్లో ఈ సినిమాలోని కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వృద్ధి సినిమాస్ పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సహనిర్మాతలు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం,, రత్నవేలు సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్ టెక్నికల్ గా 'పెద్ది'కి ప్లస్ పాయింట్స్. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యిందని సమాచారం. ఈ ఏడాది చివరికి షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది మార్చి 27న చరణ్ బర్త్డే స్పెషల్ గా ‘పెద్ది’ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
-
Home
-
Menu