పవన్ వ్యాఖ్యలు బాధించాయి.. ఆర్. నారాయణమూర్తి

పవన్ వ్యాఖ్యలు బాధించాయి.. ఆర్. నారాయణమూర్తి
X
సీనియర్ నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, థియేటర్ల పర్సంటేజ్ విధానం, టికెట్ ధరలు, థియేటర్ బంద్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

సీనియర్ నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, థియేటర్ల పర్సంటేజ్ విధానం, టికెట్ ధరలు, థియేటర్ బంద్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈకోవలోనే ఇటీవల పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేశ్ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘బంద్ అంటే ముందుగానే ప్రకటించాలి. జూన్ 1 బంద్‌ను ‘హరిహర వీరమల్లు‘ సినిమాకు లింకు చేయడం సరికాదు‘ అని స్పష్టం చేశారు.

‘పర్సంటేజ్ విధానం అమలైతే చిన్న నిర్మాతలైన మా వంటి వాళ్లకు ఉపశమనం లభిస్తుంది. ఇది ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి సంబంధించినది కాదు. థియేటర్ల బంద్‌ అన్నది ఓ బ్రహ్మాస్త్రం. దీన్ని తప్పుపట్టడం సరికాదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు గర్వంగా ఉంది కానీ, ఈ విషయంలో ఆయన వ్యాఖ్యలు బాధించాయి,‘ అని నారాయణమూర్తి అన్నారు.

పీపుల్స్ స్టార్ మరోవైపు సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ థియేటర్లు దేవాలయాల వంటివి. కార్పొరేట్ సిస్టమ్స్ వల్ల ఇవి కళ్యాణ మండపాలుగా మారుతున్నాయి. పర్సంటేజ్ విధానాన్ని అమలు చేసి, నిర్మాతలకు భరోసా కల్పించాలి‘ అన్నారు.

అదే సమయంలో, టికెట్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘వినోదం సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. ‘షోలే, మొఘల్-ఏ-ఆజాం, లవకుశ’ వంటి గొప్ప చిత్రాలు పెద్ద బడ్జెట్‌తో వచ్చినా ధరలు పెంచలేదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు వస్తారు‘ అని ఆయన అన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులను ప్రశంసిస్తూ, ఏపీలోనూ ఇలాంటి పురస్కారాలను ప్రవేశపెట్టాలని కోరారు.

Tags

Next Story