హార్డ్ డిస్క్ గురించి మనోజ్!

టాలీవుడ్లో మంచు కుటుంబానికి సంబంధించిన వివాదాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా, 'కన్నప్ప' సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనం వ్యవహారం మరోసారి మంచు కుటుంబంలో చిచ్చుపెట్టింది. ఈ సినిమా హార్డ్ డిస్క్ను మనోజ్ ఇంట్లో పనిచేసిన రఘు, చరిత అనే వ్యక్తులు దొంగిలించారని విష్ణు ఆరోపించడం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే తాజాగా 'భైరవం' సినిమా సక్సెస్ మీట్లో మనోజ్ను ఈ వివాదంపై ప్రశ్నించారు. అయితే, మనోజ్ ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించాడు. 'నేను ఈ విషయంపై ఏమీ మాట్లాడదలచుకోలేదు. 'కన్నప్ప' సినిమా మంచి విజయాన్ని సాధించాలని, అందరూ ఆ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను' అని మనోజ్ అన్నాడు.
మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. రఘు, చరితలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ దొంగతనం వెనుక ఎవరి ప్రమేయం ఉంది, హార్డ్ డిస్క్లోని డేటా ఎంతవరకు దుర్వినియోగం అయిందనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
-
Home
-
Menu