సెట్స్ పైకి ఐకానిక్ ప్రాజెక్ట్!

ఇండియన్ మూవీస్ గ్లోబల్ లెవెల్ లో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. కంటెంట్ పరంగా ఇంటర్నేషనల్ మూవీస్ కి పోటీ ఇవ్వబోతున్నాయి. ఈకోవలోనే ఇండియా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'AA22 x A6'. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రమిది.
అల్లు అర్జున్ 22వ సినిమాగా, అట్లీ 6వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే గ్రాండ్ లెవెల్ లో అనౌన్స్ అయ్యింది. హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలను తలదన్నేలా.. హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే ఒక నాయికగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపిక పదుకొనె ఫైనలైజ్ అయ్యింది.
ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాను ఈరోజు (జూన్ 12) నుంచి పట్టాలెక్కిస్తున్నారు. పెద్దగా హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకుంటుంది. 'పుష్ప 2' వంటి ఆల్ టైమ్ హిట్ తర్వాత అల్లు అర్జున్, 'జవాన్' వంటి బ్లాక్బస్టర్ తర్వాత అట్లీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
-
Home
-
Menu