చిరంజీవి ఓటీటీ ఎంట్రీపై క్లారిటీ!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీపై తొలిసారిగా అధికారికంగా స్పందించారు. లేటెస్ట్ గా జరిగిన ‘కుబేర’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న చిరు, తన స్పీచ్లో నాగార్జునను ప్రశంసిస్తూ – 'ఆయన ఆరోగ్యం, ఆలోచనలు, స్థితప్రజ్ఞత నన్నెంతో ఆకట్టుకుంటాయి. ఓటీటీలోకి అడుగుపెట్టే విషయంలోనూ ఆయన స్ఫూర్తినిచ్చారు' అని అన్నారు.
'భవిష్యత్తులో అవసరం వస్తే ఓటీటీలో సినిమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటినుంచే మానసికంగా సిద్ధంగా ఉండాలి. కానీ.. ఓకే అన్నాను కదా అని రేపే కథలతో వచ్చేయకండి' అంటూ చిరు తనదైన స్టైల్లో వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే వెంకటేష్ 'రానా నాయుడు' ద్వారా, బాలకృష్ణ 'అన్స్టాపబుల్' షో ద్వారా ఓటీటీలో సక్సెస్ఫుల్గా నిలిచిన నేపథ్యంలో చిరంజీవి కూడా ఓటీటీ ప్లాట్ఫారమ్లోకి వస్తున్నారన్న అంచనాలు ఊపందుకున్నాయి. గతంలో ఆయనకు ‘ది ఫ్యామిలీ మాన్’ వంటి వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చినా, అప్పట్లో టైమ్, స్టోరీ సెట్ కాక తిరస్కరించారట. కానీ ఇప్పుడు సరైన కథ, పాత్ర లభిస్తే ఓటీటీలోకి రావడానికే రెడీ అని చిరంజీవి స్పష్టం చేశారు.
ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. అలాగే వశిష్ఠ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘విశ్వంభర’ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక శ్రీకాంత్ ఓదెల సినిమా లైన్లో ఉండనే ఉంది. అయితే.. శ్రీకాంత్ చిత్రం కంటే ముందే మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
-
Home
-
Menu