మెగా ఫ్యాన్స్ కు క్షమాపణలు!

దర్శకుడు విజయ్ కనకమేడల తన తాజా చిత్రం 'భైరవం' ట్రైలర్ విడుదల తరువాత అనూహ్యంగా ట్రోలింగ్కి గురయ్యారు. మొదట వైఎస్సార్సీపీ అభిమానుల నుంచి విమర్శలు ఎదురైనా, తర్వాత మెగా అభిమానుల నుంచి కూడా బాయ్కాట్ పిలుపు రావడం సినిమాపై మరింత ఒత్తిడిని పెంచింది.
విజయ్ కనకమేడల 2011లో చేసినట్లుగా సోషల్ మీడియాలో కనిపించిన ఓ పాత ఫేస్బుక్ పోస్టు, చిరంజీవి, రామ్చరణ్లను ట్రోల్ చేసినట్టుగా అభిప్రాయపడేలా మార్ఫ్ చేసిన ఫోటోలు, మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో 'భైరవం'పై బాయ్కాట్ ట్రెండ్ తెరమీదకొచ్చింది.
ఈ విషయంలో వెంటనే స్పందించిన విజయ్, తన ఫేస్బుక్ ఖాతా 2011లో హ్యాక్ అయి ఉండవచ్చని వివరణ ఇచ్చారు. 'అది నేను చేసిన పోస్టు కాదు. నా అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చు. అయినా నా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నా. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడతా' అని స్పష్టం చేశారు.
విజయ్ తన కెరీర్ ఆరంభం మెగా హీరోల ప్రేరణతో జరిగిందనీ, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సమయంలో తనకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తు చేస్తూ, సాయి ధరమ్ తేజ్తో ఉన్న సన్నిహిత సంబంధాన్ని వివరించారు. 'తేజ్ నన్ను అన్నా అని పిలుస్తారు. అలాంటి నన్ను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటాను?' అని ప్రశ్నించారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. తమిళ బ్లాక్బస్టర్ 'గరుడన్'కు ఇది రీమేక్ కాగా, తెలుగులో విభిన్నంగా తీర్చిదిద్దినట్టు సమాచారం. ఇప్పటికే 'భైరవం' నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్కు మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి 'గిచ్చమాకు' అంటూ సాగే పక్కా మాస్ అండ్ ఫోక్ సాంగ్ను రిలీజ్ రిలీజ్ చేయబోతున్నారు.
నమస్కారం
— Vijay Kanakamedala (@DirVijayK) May 22, 2025
అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..
మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్…
-
Home
-
Menu