మనోజ్ కు మద్దతుగా రోహిత్

మనోజ్ కు మద్దతుగా రోహిత్
X
మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం‘. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు.

మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం‘. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. మే 30న ‘భైరవం‘ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈనేపథ్యంలో లేటెస్ట్ గా ‘భైరవం‘ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మనోజ్ ఎమోషనల్ స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆరు సంవత్సరాల విరామం తరువాత మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్న మనోజ్, తన ప్రయాణాన్ని తలచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈవెంట్‌లో ప్రసారమైన ఓ వీడియో చూసి కంటతడి పెట్టుకున్నాడు. ‘సొంతవాళ్లు దూరమవుతున్న ఈ రోజుల్లో అభిమానుల ప్రేమే నాకు బలమై నిలుస్తోంది‘ అంటూ స్పందించిన మనోజ్ మాటలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి.

ఈ స్పీచ్‌కు స్పందనగా నారా రోహిత్, సోషల్ మీడియా వేదికగా మనోజ్‌కు అండగా నిలిచాడు. ‘ఈవెంట్‌ను విజయవంతం చేసిన ఏలూరు ప్రజలకు ధన్యవాదాలు. మనోజ్ స్పీచ్ నాకూ ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది. బాబాయ్, ఏదైనా జరిగినా నేను నీతోనే ఉంటాను. లవ్ యూ‘ అంటూ రోహిత్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Tags

Next Story