పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రజాసమస్యలపై దృష్టిసారించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, ఆకస్మికంగా హృదయాన్ని కలిచే వార్త విన్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్, సింగపూర్ లోని తన పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళు గాయపడడమే కాక, పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆసుపత్రిలో ఆయనకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు.
ఈ వార్త తెలిసిన వెంటనే పవన్ కి సింగపూర్ వెళ్లాలన్న సూచనలు అధికారులు, కుటుంబ సభ్యులు అందించారు. అయితే, మన్యంలో పర్యటనలో భాగంగా, అరకు సమీపంలోని కురిడి గ్రామానికి ఇచ్చిన మాట గుర్తుకు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. 'మాట ఇచ్చాను… అక్కడి గిరిజనులు ఎదురు చూస్తున్నారు. వారి అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను అక్కడికి వెళ్తాను,' అని స్పష్టం చేశారు. పర్యటన ముగిసిన తరువాత విశాఖపట్నం చేరుకొని, వెంటనే పవన్ సింగపూర్ కు బయలుదేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
-
Home
-
Menu