యువ హీరోపై కేసు నమోదు!

టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త వివాదంలో ఇరుక్కొన్నారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా, పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఆయనపై కేసు నమోదైంది.
బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని తన నివాసానికి వెళ్తుండగా రాంగ్ రూట్లో కారును తీసుకెళ్లారు. ఈ సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయనను ఆపి వివరాలు కోరడంతో, శ్రీనివాస్ అప్రమత్తమై వెనక్కి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై వచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు విచారణ జరిపి కేసు నమోదు చేశారు.
ఈ ఘటనలో బెల్లంకొండ శ్రీనివాస్, ట్రాఫిక్ కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించడంతో పాటు, కారుతో వేగంగా దూసుకెళ్లేందుకు ప్రయత్నించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన మల్టీస్టారర్ ‘భైరవం‘ మే 30న విడుదలకు ముస్తాబవుతుంది. ఆ తర్వాత ‘హైందవ, కిష్కిందపురి, టైసన్ నాయుడు‘ వంటి చిత్రాలు లైన్లో ఉన్నాయి.
-
Home
-
Menu