నేతలు లేని పార్టీగా వైసీపీ.. వైఖరే కారణం అంటున్న పార్టీ శ్రేణులు

వైసీపీలో సరైన నాయకులు లేక పార్టీ ఇబ్బందుల్లో పడింది.చాలా మంది నాయకులు ,కార్యకర్తలు అధికార పార్టీ లోకి చేరిపోతే ,కొంత మంది మాత్రం పార్టీకి దూరంగా ఉంటున్నారు.పార్టీలో యువతకు పెద్దపీట వెయ్యాలి అని వైసీపీ అధ్యక్షులు జగన్ చుస్తునారు.కానీ ఎప్పుడు సీన్ రివర్స్ అయింది,యువత కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటుంది.దీనికి ముఖ్య కారణం పార్టీలో నాయకత్వ లోపమే అనిచెప్పాలి.
ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వైస్సార్సీపీ పార్టీ అధినేతలు పూర్తిగా విఫలం అయ్యారు.ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తామని అది కూడా ఇవ్వడం లేదు.అయితే వీటిని ఆసరా చేసుకుని, నిరసనలు తెలపడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచాలనేది వైసీపీ రాజకీయ వ్యూహం.అయితే దీనికి ఎంత స్పందన వచ్చింది.. ఏ మేరకు సక్సెస్ అయింది.. అనేది చూసుకుంటే మాత్రం వైసిపి పూర్తిగా విఫలమైంది అని చెప్పాలి. దీనికి వైస్సార్సీపీ నాయకులు తరుపున చాలా తప్పులు కనిపించాయి.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ముఖ్యంగా పొదిలి, గుంటూరు జిల్లా రెంటపాళ్ల ఘటనల నేపథ్యంలో వైసీపీకి కొంత ఊపు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అప్పటికప్పుడు రూపకల్పన చేశారు. కానీ దీనిని సక్సెస్ చేయడంలో నాయకులు చొరవ చూపకపోగా అత్సుహంతో పార్టీ కేడర్న్ మరింత దిగజార్చారు.పార్టీలో కొంతమంది నాయకులూ చేస్తున్న పనులవల్ల పార్టీ కి తీవ్ర నష్టం కలుగుతుంది.మరి ఈ విషయం వైసిపి అధ్యక్షునికి తెలుసు అనుకోవాలా తెలియదనుకోవాలో అర్థం కావడం లేదు.
ఇంకోవైపు పోలీసుల నుంచి కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.జగన్ ర్యాలీలు సినిమా ఫక్కీలో రప్ప రప్ప అంటూ జరుగుతున్నాయి కానీ రాజకీయ సారాంశంలో లేవు అని ప్రజల వాదన.ఇప్పటికి కూడా జగన్ సీఎం అవ్వాలి అనే తపన తప్ప ప్రజలకు మేలు చేయాలి అని చూడటం లేదు అని పార్టీ కార్యకర్తల అసహనం వ్యక్తం చేస్తున్నారు.వైస్సార్సీపీ ధోరణి ఇలానే కొనసాగితే పార్టీ జెండా మోసే కార్యకర్త కూడా లేని పరిస్థితి వస్తుంది.
-
Home
-
Menu