బాబు ష్యురీటి....మోసం గ్యారంటీ అంటూ ప్రజల్లోకి వైస్సార్ పార్టీ

మాజీ ముఖ్యమంత్రి వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుస కేసులతో వైసీపీనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తున్న వేళ తాడేపల్లి లో పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ప్రస్తుత పరిస్థితు లపైన స్పందించారు. పోరాటాలు వైసీపీకి కొత్త కాదని వ్యాఖ్యానించారు. కేసులు.. జైళ్లతో కట్టడి చేయలేరని పేర్కొన్నారు. ఇదే సమయంలో పార్టీ నుంచి అమలు చేయాల్సిన కార్యాచరణ పైన స్పష్టత ఇచ్చారు. ఇక నుంచి తనతో పాటు వైస్సార్సీపీ నాయకులు అందరూ ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ చేసారు. ఇందు కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబును పాలనను ప్రజల్లో ఎండగట్టాలని నిర్దేశించారు.
జూలై 1వ తేదీ నుంచి కూటమి ఎమ్మెల్యేలు ఏడాది పాలనలో చేసిన కార్యక్రమాల గురించి గడప గడపకు వెళ్లాలని సీఎం చంద్ర బాబు ఆదేశించారు. సరిగ్గా ఇదే సమయంలో జగన్ సైతం తమ పార్టీ నేతలను జనం మధ్యకు వెళ్లేలా కొత్త కార్యక్రమం రూపొందించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు, అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ'రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో' పేరుతో వైయస్సార్సీపీ 5 వారాల కార్యక్రమాన్ని జగన్ ఖరారు చేసారు. దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ ఆవిష్కరించిన జగన్.. ఇంటింటికీ దాన్ని చేర్చేలని వైస్సార్సీపీ నాయకులకు దిశ నిర్దేశించారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు.. బాండ్ల గురించి ప్రజలకు గుర్తు చేస్తూ ఏ విధంగా మోసం చేసారో వివరించాలని జగన్ సూచించారు. పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు మరో వైపు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్. ఆరు త్రైమాసికాలు పెండింగ్ ఉందని.. అలా రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4200 కోట్గుగా పేర్కొన్నారు. అయిదు వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ నిర్దేశించారు. గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని స్పష్టం చేసారు.ఇక నుంచి నిత్యం ప్రజల మద్యే ఉండి ప్రజలకోసం పోరాడాలి అని అని జగన్ తేల్చి చెప్పారు.
-
Home
-
Menu