సింగయ్య మృతి కేసులో వైస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్

సింగయ్య మృతి కేసులో వైస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్
X
సత్తనపల్లిలో జరిగిన సంఘటన గాను జగన్ హైకోర్ట్ ని ఆశ్రయించారు

పల్నాడు జిల్లా రెంటపాళ్ల లో జరిగిన వైసీపీ అధినేత జగన్ ర్యాలీ లో దళిత వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి అందరికి తెలిసిందే.ఇందిలో వైస్ జగన్ ని A-2 గా డ్రైవర్ రమణ రెడ్డి ని A-1,ఇంకా పేర్ని నాని ,విడుదల రజని ,పిఏ నాగేశ్వరరెడ్డి,వైవీ సుబ్బారెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేసారు.ఇటీవలే జిల్లా ఎస్పీ జగన్ మీద 105 సెక్షన్ మిగతా వారిపై 49 సెక్షన్ క్రింద కేసు ఫైల్ చేసినట్టు ప్రకటించారు.

దీనిపై వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ హైకోర్టు లో క్వాష్ పిటిషన్ దాఖలుచేసారు.జగన్ తో పాటు మిగతా నాయకులు కూడా క్వాష్ పిటిషను దాఖలు చేశారు.హైకోర్టు ఈ పిటిషన్ల పై రేపు(జులై 26) విచారణ చేపట్టనుంది.

Tags

Next Story