శాంతి కాదు యుద్ధమే కావాలి అంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

శాంతి కాదు యుద్ధమే కావాలి అంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
X
ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులు

పాకిస్థాన్ పై భారత్ యుద్ధం ప్రకటించగానే శాంతి చర్చలు జరగాలి అని కోరుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధంలో ద్వంద వైఖరి కనబరుస్తున్నారు.ఎలాగైనా ఇరాన్ ను దెబ్బకొట్టాలి అని ఇటీవలే పాకిస్థాన్ సైనిక అధ్యక్షుడు మునీర్ ను అమెరికా పిలిపించుకొని మరీ మంతనాలు జరిపారు.ఇరాన్ సరిహద్దులో ఉండే పాకిస్థాన్ భూభాగం ద్వారాగా దాడులు చేయాలి అని అమెరికా చూస్తున్నట్టు తెలుస్తుంది.

ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధ సహకారంలో రెండు వారాల్లో తన వైఖరి చెపుతాను అని,అప్పటి వరకు ఆ ప్రస్తావన వద్దు అని ట్రంప్ పత్రిక ముఖంగా ప్రకటించారు.అగ్రరాజ్యం రెండువారాల గడువు ఇవ్వడంతో కొంచం సమయం దొరికింది అనుకున్న ఇరాన్ కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది.గడువు లోపులోనే అమెరికా సైన్యం ఇరాన్ అణుస్తావరాలపై వైమానిక దాడులు చేసింది.ఈ దాడులతో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కినది.ఇరాన్ లోని ఫోర్డ్,నంతజ్,ఇస్ఫాహన్ ,అణుకేంద్రాలపై దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసింది.30 పౌండ్ల బంకర్ బ్లస్టర్ బాంబులను తీసుకెళ్లగల ఆరు బి- 2 స్టెల్త్ బాంబర్లతో విరుచుకు పడింది.అగ్రరాజ్యం చేసిన పనికి ఇరాన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఇజ్రాయిల్ కు తెలియకుండానే అమెరికా ఈ దాడులు చేసింది అని ప్రకటించినప్పటికీ,దాడులు ముగిసిన తరువాత తమ సహకారం తోనే ఈ దాడులు జరిగాయి అని ప్రకటించుకుంది ఇజ్రాయిల్ .అమెరికా అధ్యక్షుడు ఈ దాడులను సమర్ధిచుకున్నారు,ఇరాన్ సుప్రీం సైనాక అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ ఉన్న లొంగిపోవాలి అని లేదంటే దాడులు మరింత తీవ్రతరం చేస్తాం అని హెచ్చరించారు.

అగ్రరాజ్యం తమను మోసం చేసింది అని, దాడులకు ప్రతి దాడులు తీవ్రతనంగా ఉంటాయి అని ఇరాన్ సైనిక అధ్యక్షుడు ప్రకటించారు.పశ్చిమాసియా లోని అమెరికా సైనిక స్థావరాలపైనా ,అమెరికా పౌరులపైనా తమ దాడులు తీవ్రంగా ఉంటాయి అని జాతీయ మీడియా ద్వారా హెచ్చరించింది.అమెరికా అధ్యక్షుడు మొదలు పెట్టిన యుద్ధం తాము పూర్తి చేస్తాం అని ప్రకటించింది.అమెరికా మీద దాడి చేస్తే ఎప్పుడూ చూడని విధంగా దాడులు ఉంటాయి అని,ఇరాన్ ని పూర్తిగా నాశనం చేస్తాము అని ట్రంప్ హెచ్చరించారు.

ప్రపంచం లోనే సంపన్న దేశంగా ఉంటున్న అమెరికా ఎప్పుడూ యుద్ధనికి ముందు ఉంటుంది.డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చెప్పాటాక మరింత యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నాడు.ట్రంప్ వైఖరి మూడోవ ప్రపంచ యుద్ధనికి నాంది పలికేలా కనిపిస్తుంది.అమెరికా పరిపాలని పక్కన పెట్టి ఎప్పుడు యుద్దాలు గురించి ఆలోచిస్తున్న ట్రంప్ వైఖరి మార్చుకుంటే తప్పా జరుగుతున్న మరణహోమాన్ని ఆపలేరు.

Tags

Next Story