తెలంగాణ మీడియా వర్గాలను శోకసంద్రంలో ముంచిన యాంకర్ స్వేచ్ఛ మృతి

ప్రముఖ జర్నలిస్టు, రచయిత, యాంకర్ అయిన స్వేచ్ఛ మృతిచెందారు. ఆమె నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్వేచ్ఛకు ఇప్పటికే ఒక వివాహం జరిగినది. ఆమెకు సుమారు 13 ఏళ్ల కూతురు ఉన్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆమె మొదటి భర్తతో విడాకులు తీసుకున్నారు. అనంతరం టీ న్యూస్లో ఉద్యోగిగా పని చేసిన పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో స్వేచ్ఛ సహజీవనం చేస్తున్నారు.గత కొంతకాలంగా స్వేచ్ఛ, పూర్ణచంద్రరావు మధ్య విభేదాలు తీవ్రంగా పెరిగినట్లు ఆమె సన్నిహితుల సమాచారం. ఈ నేపథ్యంలో జూన్ 26న స్వేచ్ఛ తన తండ్రికి ఫోన్ చేసి, "పూర్ణతో కలిసి ఉండలేను నాన్న" అని మనసులో బాధను వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలోనే తన కుమార్తె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్వేచ్ఛ తండ్రి వాపోయారు. “నా కుమార్తెను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నెట్టిన పూర్ణకు కఠినమైన శిక్ష విధించాలి,” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలను విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలతో పాటు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు.స్వేచ్ఛ మరణం పట్ల మీడియా వర్గాలు, సాహిత్య సంఘాలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆమె అత్యంత నిబద్ధతతో జర్నలిజం, రచనా రంగాల్లో కొనసాగారు. ఆమె ఆకస్మిక మృతి ఎంతోమందికి వ్యక్తిగతంగా దెబ్బతీసిన విషయం.
-
Home
-
Menu