మంత్రి పదవులకు కూడా రిజర్వేషన్ అవసరమా ?

అందం అభినయం తో పాటు లక్ కూడా కలిసిరావాలి సినిమా ప్రపంచం లో లేడీ అమితాబచ్చన్ గా హీరోలతో సమానంగా తనకంటూ ఒక స్టార్ డం ని క్రియేట్ చేసుకున్న నటి విజయశాంతి. సినిమాలో కలిసి వచ్చిన లక్ ఆమెకు రాజకీయంలో ఉందా అంటే లేదనే చెప్పాలి, తన సినీ ప్రస్థానం లో మకుటంలేని మహారాణి గా వెలిగిన తన జీవన ప్రయాణం,రాజకీయం మాత్రం అందని ద్రాక్షపండులాగే ఉంది.
తల్లి తెలంగాణ పేరుతో స్థాపించిన రాజకీయ పార్టీని రాజకీయం గా నిలబెట్టుకోలేక పోయారు.ఆ తరువాత తెరస తో చేతులు కలిపి తన పార్టీ ని తెరస లో విలీనం చేసారు.తరువాత కేసిర్ విబేధాలు కారణంగా వాళ్ళ పార్టీలో ఉండలేక పార్టీకి రాజీనామా చేసారు.తెలంగాణ పోరాటయోదినిగా ఎన్నో ఉద్యమాలు చేసిన విజయశాంతి పూర్తిగా తెలంగాణ ప్రజల మన్నలు పొద్దలేకపోయారు.అనేక పార్టీ జండాలు మోసిన రాములమ్మ,ఇప్పుడు తను చేరిన అధికారం లో ఉన్నకాంగ్రెస్ పార్టీ లో కూడా సరైన గుర్తింపు ఇవ్వడం లేదు అని వాపోతున్నారు.
ఆమెకు ఎమ్మెల్సీ పదవి కోసం ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగ వలసి వచ్చింది.ఇప్పుడు ఈ రామ్ములక్కకి మినిస్టర్ పదవికోసం తన దగ్గర ఉన్నరిజర్వేషన్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు.తనకు బీసీ రిజర్వేషన్ కోటాలో మంత్రి పదవి కావాలి అని ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు.ఈ మద్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో దాదాపు 15 నిముషాలు సమావేశం అయ్యారు.బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన విజయశాంతి రేవంత్ ప్రభుత్వం కూడా సరైన గుర్తింపు ఇవ్వకపోయేసరికి బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కన్నా ఢిల్లీ ప్రభుత్వ పెద్దల్ని అడుగుతునట్టు తెలుస్తుంది.
తెలంగాణలో ప్రస్తుతం 12 మంత్రి పదవులు ఉండగా మరో 6 వాటికి మాత్రమే చోటువుంది,ఉన్న 6 మంత్రి పదవులకి కాంగ్రెస్ సీనియర్ లీడర్ నాయకులు చాలా మంది పోటీపడుతున్నారు,వీళ్ళని కాదని తెలంగాణ అధిష్టానం రామ్ములమ్మకి మంత్రి పదవి ఇచ్చే ఆలోచన లేనట్టు కనబడుతుంది.అందుకే తనకు బీసీ కోటాలో మంద్రి పదవి కావాలి అని ఎక్కువ గానే ప్రయత్నిస్తన్నారు.కానీ తెలంగాణ సీనియర్లు దీన్ని అంగీకరించనట్టు తెలుస్తుంది.యంత స్టార్ సెలబ్రెటీ అయినా పదవి కోసం రిజర్వేషన్ ఉపయోగించుకోక తప్పటలేదు.సినిమా ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించిన విజయశాంతి గారు రాజకీయాల్లో మాత్రం వెనకపడిపోయారు అనే చెప్పాలి
-
Home
-
Menu