బీజేపీ లోకి చేరబోతున్న ప్రముఖ సినీనటి మీనా

బీజేపీ లోకి చేరబోతున్న ప్రముఖ సినీనటి మీనా
X
నటనకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాలలోకి అడుగిడుతున్న సినీ నటి

సినిమా నటులు రాజకీయాలులోకి రావటం కొత్తమీ కాదు, కెరియర్ తో సంబంధం లేకుండా రాజకీయాలలోకి వచ్చిన నటులు చాల మంది ఉన్నారు.వాళ్ళ గ్లామర్ తో ప్రజల్ని ఆకర్షించి ,పొలిటికల్గా విజయం సాధించిన వారు ఇండియన్ సినీ చెరిత్రలో చాల మంది నటులు ఉన్నారు.రాజకీయ పార్టీలు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారిని తమ పార్టీ లో సముచిత స్థానం ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం.

ఇప్పుడు ఆ కోవలో ప్రముఖ సినీ నటి మీనా వచ్చి చేరింది.సినిమా ఇండస్ట్రీలో ఆమెకు ఇంకా అవకాశాలు ఉన్నా ,రాజకీయాలోకి రావాలని చూస్తున్నారు.నాలుగు దశాబ్దాల పాటు సినిమా ప్రపంచంలో గడిపిన మీనా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ వంటి పలు భాషల్లో విజయవంతం అయిన చిత్రాలలో నటించారు.2022 భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె కూతురు నైనికతో ఒంటరి జీవితం గడుపుతున్నారు.

ఇప్పుడు మీనా బీజేపీ పార్టీ తీర్ధం పుచ్చుకుపోతున్నారు అనటంలో ఎంటువంటి సందేహం కనబడుటలేదు.ఇటీవలే మీనా ఢిల్లీ వెళ్లి ఉపరాష్ట్రపతి జనదీప్ ధనఘడ్ ను కలిశారు.ఉపరాష్ట్రపతి తో దిగిన ఫోటో మీనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మీ నుంచి చాల నేర్చుకున్నాను, భవిష్యత్తు కార్యాచరణకు నాకు అవి ఎంతో ఉపయోగ పడతాయి అని భావిస్తున్నాను ,మీకు ధన్యవాదాలు అని సోషల్ మీడియా వేదికగా చెప్పారు.జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మీనా బీజేపీ లోకి చేరటం ఖాయం అని అనుకుంటున్నారు నెటిజన్లు.

వచ్చే సంవత్సరం జరుగు తమిళనాడు ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలి అని చూస్తున్న కమలనాధులు ఇప్పటికే అన్నా డీఎంకె తో పోతు కుదుర్చుకున్నారు.పార్టీ బలోపేతానికి బీజేపీ నాయకులు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో పలువురు సినీ ప్రముఖుల్ని పార్టీ లోకి ఆహ్వానిస్తున్నారు.ఇప్పటికే ప్రముఖ నటి ఖుష్బూ కూడా బీజేపీ నాయకురాలు.నటి మీనా కూడా కుష్బూ సాయం తోనే బీజేపీ లోకి చేరుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అందుకనే మీనా ఉపరాష్ట్రపతిని కలవడానికి ఢిల్లీ వెళ్లినట్టుగా తెలుస్తుంది.దీనితో మీనా బీజేపీ లోకి చేరబోతోంది అని ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.మీనా మాత్రం తను రాజకీయాలలోకి వస్తున్నట్టు ఇంకా ప్రకటించ లేదు.మీనా రాజకీయాలలోకి రాబోదు అని ఆమె అభిమానులు అంటున్నారు.మీనా రాజకీయ ప్రవేశం ఉంటుందా లేదా?ఆమె ఏ పార్ట్ లోకి చేరబోతున్నారు అనేది ఆమెనే చెప్పాలి.

Tags

Next Story